Reading Time: < 1 minute
Cinema : రూ.9 కోట్లతో తీస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను షేక్ చేసిన తమిళ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..

ప్రస్తుతం ఓటీటీలోకి కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు సస్పెన్స్, హారర్ సినిమాలు దూసుకుపోతున్నాయి. మరోవైపు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ మూవీ పేరు తాయ్ కిళవి. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ రూ.75 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

తమిళ డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ హార్ట్ టచింగ్ కామెడీ డ్రామాలో రాధిక మెయిన్ లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రాన్ని హీరో శివకార్తికేయన్ సొంత నిర్మాణ సంస్థపై నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా సినీప్రియులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఏప్రిల్ 10 నుంచి జియో హాట్ స్టార్, సింప్లీ సౌత్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులను సైతం ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..

ఈ సినిమాలో రాధిక విభిన్న లుక్ లో కనిపించింది. 63 ఏళ్ల వయసులో దాదాపు 5 గంటలపాటు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని పవునుత్తాయి అనే వృద్ధురాలి పాత్రలో జీవించేసింది. చాలా కాలం తర్వాత రాధిక నటనను చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాకు ప్రధాన బలం రాధిక నటన. ఇప్పుడు అదే మూవీ ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయ్యింది.

ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?