
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో ప్రభాస్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పేలా లేదు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టుల వల్ల ‘స్పిరిట్’ షూటింగ్ డిలే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ప్రభాస్ ఈ సినిమా కోసం భారీగా బల్క్ డేట్స్ కేటాయించినట్టుగా వార్తలు వచ్చాయి.
Also Read : Tovino Thomas : టాలీవుడ్ మూవీస్ మేకింగ్ పై మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ సెటైర్స్
కానీ, ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత లెక్కలు మారిపోయాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా ఇప్పటికే చాలా లేట్ అయింది. దీంతో ప్రభాస్ ఇప్పుడు ఆ సినిమాకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వీలైనంత త్వరగా ‘ఫౌజీ’ని పూర్తి చేసి, ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ‘కల్కి 2898 AD’ సీక్వెల్ టీమ్ కూడా ప్రభాస్ కోసం వేచి చూస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల కాల్షీట్స్ ఉన్నా, ప్రభాస్ డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదు. ప్రస్తుతం ప్రభాస్కు ‘ఫౌజీ’, ‘కల్కి 2’ వంటి భారీ చిత్రాల మధ్యలో ‘స్పిరిట్’ షూటింగ్కు సమయం కేటాయించడం కష్టతరంగా మారిందని టాక్. మరోవైపు.. ప్రభాస్ అందుబాటులో లేకపోయినప్పటికీ.. ఆయన లేని కీలక సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు సందీప్ రెడ్డి. కాబట్టి, స్పిరిట్ విడుదలలో ఏ మాత్రం మార్పు ఉండదని తెలుస్తోంది. ఏదేమైనా.. మార్చి 5, 2027న ‘స్పిరిట్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సందీప్ సన్నాహాలు చేస్తున్నాడు.