
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో భాగంగా నాలుగవ మ్యాచ్ మంగళవారం (మార్చి 31) నాడు న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్లో ఉన్న మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. పంజాబ్ కింగ్స్ నేడు తమ సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఇరు జట్లు ఈ మ్యాచ్తో తమ సీజన్ను ప్రారంభిస్తాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ల ఫామ్పై అందరి ఫోకస్ ఉంది. ఈ మ్యాచ్ కోసం ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కు దిగనున్నది.
పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విశాల్ విజయ్కుమార్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కాగిసో రబాడా, అశోక్ శర్మ,మహ్మద్ సిరాజ్