Reading Time: < 1 minute

సన్నీడియోల్ హీరోగా నటించిన ‘బార్డర్ 2’ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 23న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ వార్ డ్రామాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే ’బార్డర్ 2’ మూవీ గల్ఫ్ దేశాల్లో నిషేధం ఎదుర్కొంటుందని తెలుస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రేన్ వంటి దేశాల్లో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పలు సన్నివేశాలు ఉన్న కారణంగా అక్కడి ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 1971లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ’బార్డర్ 2’ సినిమా మొదటి భాగంతో పోలిస్తే విస్తృతమైన కథాంశంతో వస్తోంది.