Reading Time: < 1 minute

విదర్భ: టి20 సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్‌పై భారత జట్టు 48 పరుగుల తేడాతో గెలిచింది. భారత బ్యాట్స్‌మెన్లు అభిషేక్ శర్మ, రింకు సింగ్ సిక్స్‌ల వర్షం కురిపించారు. అభిషేక్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. రింకు సింగ్ 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.