Reading Time: < 1 minute

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మందా సాల్మన్ కుటుంబ సభ్యులు కలిశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసిపి కార్యకర్త సాల్మన్‌పై టిడిపి కార్యకర్తులు దాడి చేయడంతో చనిపోయాడు. హత్య రాజకీయాలను ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మృతుడి కుమారుడు ఆరోపణలు చేశాడు. తాడేపల్లిలోని వైసిపి కార్యాలయంలో వైఎస్ జగన్‌ను సాల్మన్ కుమారులు, కుమార్తె కలిసింది. 

కూటమి అధికారంలోకి రాగానే టిడిపి నాయకుల బెదిరింపులతో మందా సాల్మన్ ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఇటీవ‌ల కుటుంబ సభ్యులను చూడటానికి పిన్నెల్లి గ్రామానికి వచ్చారు. ఎంత ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో గ్రామంలోకి వ‌స్తావా అంటూ సాల్మన్ పై తెలుగుదేశం నాయకుడు, కార్యకర్తలు రాడ్లతో దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే.