Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: శబరిమల బంగారు దొంగతనం కేసులో మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. శబరిమల ఆలయానికి సంబంధించిన బంగారం, ఇతర ఆలయ ఆస్తుల దుర్వినియోగానికి సంబంధించి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం కేరళ, కర్ణాటక, తమిళనాడులోని సుమారు 21 ప్రదేశాలలో సోదాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా, బంగారు అక్రమ రవాణా కేసు విచారణ కోసం ఇప్పటికే కేరళ హైకోర్టు పర్యవేక్షణలో రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శబరిమల ఆలయ సన్నిధానానికి చేరుకుంది. ఈ బృందం బంగారు పలకల పరిమాణాన్ని కొలిచి, నమూనాలను సేకరిస్తుంది.

కాగా, ప్రాథమిక దర్యాప్తులో బంగారు పూత పూసిన పవిత్ర కళాఖండాలను అధికారిక రికార్డులలో ఉద్దేశపూర్వకంగా రాగి పలకలుగా తప్పుగా చూపించి, 2019-2025 కాలంలో ఆలయ ప్రాంగణం నుండి చట్టవిరుద్ధంగా తొలగించారని వెల్లడైంది. చెన్నై, కర్ణాటకలోని ప్రైవేట్ సౌకర్యాలలో రసాయన ప్రక్రియల ద్వారా బంగారాన్ని వెలికితీశారని ఆరోపణలు ఉన్నాయి.