Reading Time: < 1 minute

ఇండోర్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన కివీస్‌కి అర్ష్‌దీప్ తొలి ఓవర్‌లోనే ఝలక్ ఇచ్చాడు. తొలి ఓవర్‌ నాలుగో బంతికి నికోలస్‌(0)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత హర్షిత్ బౌలింగ్‌లో కాన్వాయ్(5) రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. విల్ యంగ్(30), మిచెల్(22) ఉన్నారు.