Reading Time: < 1 minute

దేశ వ్యాప్త బ్యాంక్ సమ్మెల్లో భాగంలో నగరంలోని పలు బ్యాంకులు మూత పడ్డాయి. వారానికి 5 రోజులు పని వేతనాల పెంపు, పెన్షన్ సంస్కరణలు, 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పూర్తిగా అమలు కావాలని వారు బ్యాంక్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణకు నిరసగనగా ఆటోమిషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై వస్తున్న ముప్పు, పని ఒత్తిడి తగ్గించాలని ,మెరుగైన వర్కింగ్ కండిషన్స్ ఉండాలని సిబ్బంది కొరత తీర్చాలని, పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్దరించడ లేదా మెరుగైన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. బ్యాంక్‌ల సమ్మె కారణంగా ఖాతాదారులు ఇబ్బంది పడినప్పటికి ఏటిఎం, యుపిఐ వంటి సాధారణ సేవలుపని చేశాయి. కానీ కౌంటర్ సేవలు ( క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా ,డ్రాఫ్ట్‌లు, లోన్ ప్రాసెసింగ్)లు మాత్రం జరగలేదు. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపారులు, పెన్షన్ దారులు, విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు.