
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీల్లో మోసాలను అరికట్టడానికి బుధవారం నుంచి 2-ఫ్యాక్టర్అథెంటికేషన్ విధానం అమల్లోకి వచ్చింది. దీనివల్ల యూపీఐ సహా అన్ని డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితం కానున్నాయి. ఇకపై వినియోగదారులు కేవలం పిన్ ఎంటర్ చేస్తే సరిపోదు.
ఓటీపీ లేదా వేలిముద్ర లేదా ఫేషియల్ రికగ్నిషన్ వంటి రెండో దశ అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైనా మీ పిన్ తెలుసుకున్నా, రెండో దశ గుర్తింపు లేనిదే చెల్లింపులు జరగవు. భద్రత దృష్ట్యా బ్యాంకింగ్ యాప్స్లో స్క్రీన్ షాట్ తీయడం లేదా స్క్రీన్ను రికార్డ్ చేయడంపై నిషేధం ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.