
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ నగరం తిరుపతిలో కోర్ట్ యార్డ్ బై మారియట్ హోటల్ ప్రారంభమైంది. మారియట్ బాన్వాయ్ గ్రూప్ దీనిని నిర్మించింది. తిరుమలను దర్శించుకునే వారి కోసం 130 గదులతో దీనిని కట్టారు. రైల్వే స్టేషన్ నుంచి 15 నిమిషాలు, విమానాశ్రయం నుంచి 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఈ హోటల్ ఉంది. ఇందులో జిమ్, స్పా, స్విమ్మింగ్పూల్ వంటి సదుపాయాలు ఉన్నాయి.