తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో భాగమయ్యారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కలు తీర్చుకున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక ప్రియాంక నల్కారీ కూడా బోనమెత్తింది. అమ్మవారికి మొక్కులు సమర్పించ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.
బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రియాంక షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక నల్కారీ అని చెప్పవచ్చు.
ఒకప్పుడు తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మెప్పించిందీ ఈ తెలుగమ్మాయి. అలాగే కొన్ని టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడంలేదు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటోంది ప్రియాంక. అక్కడ వరుస గా సీరియల్స్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తోంది
కాగా తెలుగులో కొన్ని సినిమాల్లోనూ నటించింది ప్రియాంక. 2010లో చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన ‘అందరి బంధువయా’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కిక్ 2, కాంచన 3, శివ మనసులో శృతి, హైపర్, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించిందీ అందాల తార.




