పాము ముగీసకు అస్సలే పడదు. ఇవి రెండు ఎదురుపడితే చాలు పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభం అవుతుంది. అయితే వీటికి పగ ఎక్కడ మొదలైంది అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంత మంది ఆహారం అంటే, మరికొంత మంది జానపద , పురాణ కథలు చెబుతుంటారు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం. పురాణ కథల ప్రకారం, కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, కుద్రువ, వినత, కుద్రవ పాములకు తల్లి, వినత గరుడుడు, అరుణుడికి తల్లి.
అయితే కుద్రవకు వినతపై విపరీతమైన ద్వేశం ఉండేదంట. అలా ఒక రోజు వీరిద్దరు పందెం కాస్తారు. అందులో కుద్రవ మోసం చేసి వినతను ఓడిపోయేలా చేసి, దాస్యం చేయిస్తుంది. దీంతో నిజం తెలుసుకున్న వినత, పాములకు శాపం పెడుతుందంట. అప్పటి నుంచి వినత కుమారుడు గరుడుడు, పాములను తినడం మొదలు పెతాడంట. అలా అప్పటి నుంచి గరుడుడు జాతికి చెందిన పక్షలుతో పాములకు పగ మొదలైదంట. ముంగీసను నేల గరుడు అంటారు. అందుకే ఇది కూడా పాములను వేటాడి మరి చంపుతుందంట.
ఇలా పురాణ కథలు కొంత మంది చెబుతుంటారు. అయితే కొంత మంది మాత్రం తీసుకునే ఆహారం వలన వీటి మధ్య వైరం వస్తుంది అని చెబుతుంటారు. చాలా వరకు ముంగీసలు పాములు రెండూ కూడా ఒకే విధమైన ఆహారాన్ని తీసుకుంటాయి. అయితే ఇవి ఎప్పుడు కూడా ఆహాం వేటాడే చోట ఎదురుపడుతుంటాయంట. దీంతో తమ ఆహారం కోసం ఇవి పోటీ పడతాయని చెబుతుంటారు.
అంతే కాకుండా ముంగీసకు పాము విషం తట్టుకునే శఖ్తి ఉంటుంది. పాము విషం కూడా దీనిపై డైరెక్ట్గా అంతగా పని చేయదు కాబట్టి, ముంగీస పాముతో పోటీ పడి , తమ ఆహారాన్ని దక్కించుకుంటుంది అని చెప్పుకొస్తుంటారు. ఇలా పాము ముంగీసల వైరం గురించి అనేక కారణాలు చెబుతుంటారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




