
వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బుధవారానికి అల్పపీడనంగా మారనుండటంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. రాగల రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.వాతావరణ శాఖ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఆగస్టు, అక్టోబర్ మధ్య ఎల్నినో ప్రభావం తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. ఇది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, తీవ్రమైన ఉష్ణోగ్రతలకు దారి తీయవచ్చని పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే..
రాకింగ్ స్టార్ యశ్ మాస్టర్ ప్లాన్