Reading Time: < 1 minute
Ms Raju Clarification Ntr Chicken Comments Agadha

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో, అజయ్ కేఆర్ సమర్పణలో సీనియర్ మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

అంతేకాక తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోఎన్టీఆర్ గారిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ “ఎన్టీఆర్ గారిపై ఉన్న అపరిమితమైన అభిమానంతోనే ఆ మాట సరదాగా అన్నాను. ఆయన క్రమశిక్షణ, నిబద్ధత నాకు ఎంతో స్పూర్తి. ‘అగధ’ కోసం ఆయనలాగే ఉదయాన్నే 3 గంటలకు లేచి పనిచేశాను” అని స్పష్టం చేశారు. ఇక సినిమా విడుదల విషయానికి వస్తే, ట్రైలర్ చూసి హోంబలే ఫిలిమ్స్, గీతా ఆర్ట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధులు సంప్రదించారని, ముందుగా తెలుగులో విడుదల చేశాకే ఇతర భాషల్లో రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ థియేటర్లలో విడుదలైన 60 రోజుల తర్వాతే ఉంటుందని తేల్చి చెప్పారు.