Reading Time: < 1 minute
Rukmini Vasanth Malayalam Debut With Nivin Pauly In Talks For Ram Charan Sukumars Rc17

కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి, సౌత్ ఇండియా మొత్తాన్ని తన నటనతో, క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది రుక్మిణీ వసంత్. ఇప్పటికే కన్నడ, తమిళం, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు మలయాళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ సరసన కథానాయికగా రుక్మిణి ఎంపికైంది. ‘జయ జయ జయ జయ హే’ వంటి సెన్సేషనల్ హిట్‌ను అందించిన దర్శకుడు నషిద్ ఫామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఒక్క మలయాళం మాత్రమే కాదు ప్రస్తుతం సౌత్ లోని బడా ప్రాజెక్టులన్నీ రుక్మిణీ వసంత్ డైరీలోనే ఉన్నాయి. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ లో రుక్మిణి కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి తోడు టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ మూవీలోనూ రుక్మిణి కథానాయికగా నటిస్తోంది. ఈ బ్యాక్-టు-బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో రుక్మిణీ వసంత్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మరో మైండ్ బ్లోయింగ్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. రామ్ చరణ్, డైరెక్టర్‌ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్‌ క్రేజీ ప్రాజెక్ట్ RC1లో కథానాయికగా రుక్మిణీ వసంత్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది గనుక అధికారికంగా ఖరారైతే రామ్ చరణ్ – రుక్మిణీల ఫస్ట్ కాంబినేషన్‌గా ఇది సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం. భాషతో సంబంధం లేకుండా లక్కీ చార్మ్‌గా మారిన రుక్మిణీ వసంత్… రాబోయే రోజుల్లో సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా నిలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు సినీ విశ్లేషకులు.