
PM Modi: భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడా రంగానికి సరికొత్త జవజీవం పోస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (2026, ఏప్రిల్ 28న) గ్యాంగ్టక్ నుంచి వర్చువల్గా మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇండోర్ క్రికెట్ అకాడమీలను ప్రారంభించారు. బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) (BCCI) ఆర్థిక సహకారంతో నిర్మించిన ఈ అత్యాధునిక సౌకర్యాలు ఆ ప్రాంత క్రీడాకారుల తలరాతను మార్చే అవకాశం ఉన్నాయి.
ఇండోర్ క్రికెట్ అకాడమీలు ప్రారంభం:
సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్టక్ ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా మణిపూర్లోని ఇంఫాల్, అరుణాచల్ ప్రదేశ్లోని దోయిముఖ్లలో నిర్మించిన ఇండోర్ క్రికెట్ అకాడమీలను జాతికి అంకితం చేశారు. క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో ఇదొక కీలక మైలురాయిగా నిలవనుంది.
మణిపూర్ క్రికెట్:
ఇంఫాల్లోని లువాంగ్పోక్పా స్టేడియంలో ఏర్పాటైన ఈ అకాడమీ గురించి మణిపూర్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి లైరెంజమ్ గీత్రంజన్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
* సౌకర్యాలు: మూడు ఇండోర్ ప్రాక్టీస్ పిచ్లు, జిమ్నాసియం, స్విమ్మింగ్ పూల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్.
* ఆల్ వెదర్ ట్రైనింగ్: వర్షాకాలంలో ప్రాక్టీస్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏడాది పొడవునా ఇక్కడే శిక్షణ పొందవచ్చు.
* BCCI సపోర్ట్: వచ్చే రెండేళ్ల పాటు ఈ అకాడమీ నిర్వహణ ఖర్చులను బిసిసిఐ భరించనుంది.
దోయిముఖ్ అకాడమీ:
అరుణాచల్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ అకాడమీలో ఆధునిక ప్రాక్టీస్ నెట్స్ తో పాటు ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయి. భారీ వర్షాలు కురిసే ఈ ప్రాంతంలో యువ క్రికెటర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక వరం లాంటిదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
లోకల్ టాలెంట్ – గ్లోబల్ లెవల్:
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఈ మౌలిక సదుపాయాలు స్థానిక ప్రతిభను వెలికితీస్తాయని, ఈశాన్య రాష్ట్రాల స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక 2025 సీజన్లో మణిపూర్ జట్టు 5 బీసీసీఐ డొమెస్టిక్ టోర్నమెంట్లలో ఫైనల్స్ చేరడంతో పాటు రెండుసార్లు అండర్–-19 టైటిల్స్ గెలవడం విశేషం. ఇప్పుడు ఈ కొత్త అకాడమీలతో మరింత మంది ‘లోకల్ స్టార్స్’ తయారవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
PM Narendra Modi inaugurates BCCI Indoor Cricket Academies across the North-East. pic.twitter.com/sug5ic1Zov
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 28, 2026