నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి రోజూవారీ ఆహారపు అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మన ఇంటి ప్రాంగణంలోనే దొరికే మూడు రకాల ఆకులతో షుగర్ లెవల్స్ను సులభంగా కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆకులేంటో, వాటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
కరివేపాకు మ్యాజిక్: మన వంటల్లో రోజూ వాడే కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని కరివేపాకులను నమిలి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగవడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

జామ ఆకుల టీ: జామ ఆకుల్లో డయాబెటిస్ను నియంత్రించే ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇక ఒక కప్పు నీటిలో రెండు జామ ఆకులు లేదా ఒక స్పూన్ జామ ఆకుల పొడి వేసి మరిగించి, ఆ టీని ఉదయాన్నే తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా అదుపులోకి వస్తాయి.
చేదు వేపాకు-తీపి ఆరోగ్యం: వేపాకు బ్లడ్ షుగర్ లెవల్స్ను తగ్గించడంలో ఎంతో శక్తివంతమైనది. ప్రతిరోజూ ఉదయం లేవగానే కొన్ని వేపాకులను నేరుగా నమిలి తిన్నా లేదా వేప ఆకులతో చేసిన కషాయం తాగినా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఎలా ఉపయోగించాలి?: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలడం లేదా కషాయం రూపంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వీటిని మీ రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
సహజ సిద్ధంగా లభించే ఈ ఆకులను రోజూ క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ, సరైన ఆహార నియమాలు పాటిస్తే డయాబెటిస్ను సులభంగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
గమనిక: మీరు ఇప్పటికే డయాబెటిస్ కోసం మందులు వాడుతున్నట్లయితే, ఈ సహజ కషాయాలు లేదా ఆకులను డైట్లో చేర్చుకునే ముందు ఒకసారి మీ వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.
The post షుగర్ పెరిగిందా? ఈ 3 ఆకులు మీకు రిలీఫ్ ఇవ్వొచ్చు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.