Reading Time: < 1 minute
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త.. లేకపొతే కాళీ అవుతుంది మీ ఖాతా

సైబర్ నేరాల పట్ల సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నకిలీ ప్రొఫైల్స్, డీపీలతో మోసాలు జరుగుతున్నాయని, ఇటీవల ఒక వ్యాపారవేత్తను ₹1.2 కోట్లు మోసం చేసిన కేసు నమోదైందని డీసీపీ అరవింద్ బాబు వెల్లడించారు. తెలియని వ్యక్తుల ప్రొఫైల్ అభ్యర్థనలను అంగీకరించవద్దని, ఆర్థిక లావాదేవీలకు ముందు అసలు వ్యక్తిని నేరుగా సంప్రదించి సమాచారాన్ని ధృవీకరించుకోవాలని ఆయన సూచించారు. ఒకే డీపీతో వేరే నంబర్ నుండి మెసేజ్ వస్తే అనుమానించాలని, వెంటనే అసలు నంబర్‌కు కాల్ చేసి నిర్ధారించుకోవాలని పోలీసులు కోరారు. మహిళలు, యువత బ్లాక్‌మెయిల్‌కు గురికాకుండా ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?

భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్

CM Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం

కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??

Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??