
ఇరాన్ జైలులో 50 రోజులు గడిపి, ఆపై యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయిన భారతీయ నావికుడి భయానక అనుభవం వెలుగులోకి వచ్చింది. గతేడాది, అక్రమంగా చమురు తరలిస్తున్నారనే ఆరోపణలతో ఇరాన్ ఒక దుబాయ్ ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుంది. దుబాయ్ కంపెనీ ఈ ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ, ట్యాంకర్లోని 10 మంది భారతీయ సిబ్బందిని ఇరాన్ అదుపులోకి తీసుకుంది. గాజియాబాద్కు చెందిన కేతన్ మెహతాతో సహా వారంతా 50 రోజులు జైలులో ఉన్నారు. ఫిబ్రవరి 27న విడుదలయ్యాక, భారత్కు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, మరుసటి రోజు, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్లు ఇరాన్పై సంయుక్తంగా దాడులు ప్రారంభించడంతో వారి ప్రణాళికలు తలకిందులయ్యాయి. జైలు నుండి బయటపడిన తర్వాత, మెహతాతో సహా పది మంది సిబ్బంది బందర్ అబ్బాస్లోని ఒక హోటల్లో 25 రోజులు బస చేయాల్సి వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!