Reading Time: < 1 minute
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు

శుక్రవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు రాత్రి సుమారు 9.50 గంటలకు నమోదైన ఈ ప్రకంపనలు, పంజాబ్‌లోని నోయిడా, చండీగఢ్, లుధియానాతో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్‌తో సహా పలు నగరాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి. ఎత్తైన భవనాల్లోని నివాసితులు భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగిందని, ఇంట్లోని వస్తువులు కదిలాయని, వణికిపోయాయని చాలామంది తెలిపారు.