
న్యూఢిల్లీ: భారత్కు ఆయిల్, నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ), ఎరువుల సరఫరాను భారీగా పెంచుతామని రష్యా ఆఫర్ ఇచ్చింది. 2025 చివరి నాటికి ఎరువుల సరఫరాను 40% పెంచిన రష్యా.. భవిష్యత్తులోనూ మరింత సప్లయ్ చేస్తామని తెలిపింది. తాజాగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్లతో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మాంటురోవ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వాణిజ్యం, ఎరువులు, కనెక్టివిటీ, ఇరు దేశ ప్రజల ప్రయోజనాల్లో పరస్పర సహకారం గురించి మాంటురోవ్తో చర్చించినట్లు ప్రధాని మోదీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.