
Yuvraj Singh: భారత క్రికెట్ చరిత్రలో 2007 ఏడాది ఎంతో కీలకమైన సంవత్సరం. అప్పట్లో అనూహ్యంగా ధోనీకి కెప్టెన్సీ పగ్గాలు ఎలా అందాయో మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యూవీ, తన కెరీర్ గమనాన్ని మార్చిన ఆ పరిణామాలను వివరిస్తూనే.. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) తీసుకున్న ఒక నిర్ణయంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..
ఇంటర్వ్యూలో మాట్లాడిన యూవీ 2007 టీ20 ప్రపంచకప్ సమయానికి భారత జట్టులో సమూల మార్పులు జరిగాయని, సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో కెప్టెన్సీ కోసం యువరాజ్ పేరు బలంగా వినిపించిందని.. అయితే, ఊహించని విధంగా ధోనీని కెప్టెన్గా ఎంపిక చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో నేను వైస్ కెప్టెన్గా ఉన్నాను. కాబట్టి నాకే పగ్గాలు అందుతాయని అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడి నుంచో ధోనీ వచ్చి.. కెప్టెన్ అయ్యాడు. అది ఆ సమయంలో నాకు కొంత నిరాశ కలిగించినా, జట్టు విజయం కోసం నేను అతనికి పూర్తి సహకారం అందించానని యువరాజ్ గుర్తు చేసుకున్నారు.
ఇది ఇలా ఉండగా.. ప్రస్తుత ఐపీఎల్ 2026 పరిణామాల గురించి మాట్లాడుతూ, సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై యువరాజ్ పెదవి విరిచారు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేని సమయంలో యువ సంచలనం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్కు కెప్టెన్సీ అప్పగించడాన్ని ఆయన తప్పుబట్టారు. అభిషేక్ శర్మకు జట్టుపై మంచి పట్టు ఉందని, అతనిని కాదని మరొకరికి బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్రాంచైజీలు కేవలం అనుభవం కంటే కూడా జట్టుతో ఉన్న అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.