Reading Time: < 1 minute

‘తుమ్మిడికుంట’ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు: మాదాపూర్ లోని  తుమ్మిడి కుంట చెరువు పునరుద్ధరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప‌‌రిశీలించారు. హైటెక్స్ లో జ‌‌రుగుతున్న టెక్స్​టైల్ సదస్సుకు హాజరై, తిరిగి వస్తూ చెరువు వద్దకు వెళ్లారు. దాని చుట్టూ తిరిగి పనుల పురోగ‌‌తిని తెలుసుకున్నారు. 

ఆక్రమణల కార‌‌ణంగా తుమ్మిడికుంట 14 ఎకరాలకు కుచించుకుపోయింది. చెరువు పున‌‌రుద్ధర‌‌ణ‌‌లో భాగంగా ఆక్రమ‌‌ణ‌‌ల‌‌ను తొల‌‌గించి, 28.05 ఎక‌‌రాలకు విస్తరించారు. ఈ పనులకు ప్రభుత్వం రూ.20 కోట్లు ఖ‌‌ర్చు చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.