
- బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బీఆర్ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో 3 వేల ఎకరాలు, హెచ్సీయూ భూములు, హిల్ట్ పాలసీ, టీడీఆర్ పేరుతో భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను అనుచరులకు కట్టబెట్టి తన ఆస్తులను పెంచుకుంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఉండే 250 ఎకరాలను కొల్లగొట్టేందుకు రేవంత్ సిద్ధమయ్యారన్నారు. ఎల్అండ్టీని బ్లాక్ మెయిల్ చేస్తూ మెట్రోకి చెందిన 250 ఎకరాలను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పనికిరాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు వరుసలో ఉంటే రెండో వరుసలో బండి సంజయ్ ఉంటారన్నారు.