
అమరావతి: ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉందని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే హిందువులు వ్యక్తిగంతంగానే బాధపడతారని అన్నారు. పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. ఎవరు చేసిన కర్మ వారే అనుభవిస్తారని హిందువులు భావిస్తారని, హిందువుల్లో ఈ ఉదాసీన వైఖరి మారాలని పవన్ సూచించారు. కుల, ప్రాంత, భాష విబేధాలున్నా హిందూ ధర్మం ఒక్కటేనని తెలియజేశారు. హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలని, మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలని కోరారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ఎవరికీ వ్యతిరేకం కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.