
అమరావతికి చట్టబద్ధత బిల్లు ఎట్టకేలకు రాజ్యసభకు చేరింది. సభలో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ క్రమంలో సభలో బిల్లుపై చర్చ మొదలైంది. మహిళా బిల్లు సహ ఆ, ఇతర బిల్లులపై చర్చను ఎందుకు చేపట్టడం లేదని కాంగ్రెస్ నిలదీసింది. ప్రస్తుతం దీనిపై రాజ్య సభలో చర్చ జరుగుతుంది. అయితే నిన్న లోక్సభలో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఇక రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి చెంతకు బిల్లు చేరనుంది. రాష్ట్రపతి సంతకం చేస్తే అమరావతికి చట్టబద్ధత రానుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.