అంతర్జాతీయ మార్కెట్లొ నెలకొన్ని భారీ మార్పుల తర్వాత హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,420 వద్ద కొనసాగుతుండగా ఉదయం ఈ ధర రూ.1,52,960గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర ఉదయం 6గంటలకు రూ.1,40,210గా ఉండగా రూ.1530 తగ్గి ప్రస్తుతం రూ.1,38,800 వద్ద ట్రేడవుతోంది.
ఇక ఆంద్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. రూ.1,51,420గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,52,960 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర ఉదయం 6గంటలకు రూ.1,40,210 వద్ద ఉండగా ప్రస్తుతం రూ.1,38,800 వద్ద ట్రేడవుతోంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, పూణెలోనూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,420 కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,38,800గా ఉంది.
ఇక దేశరాజధాని ఢిల్లీలో తులం బంగారం రూ.1,51, 570గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,950 వద్ద ట్రేడవుతుంది. ఇక చెన్నలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ,1,52,180గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,500 గా ఉంది.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ఇవాళ కేవలం 4గంటల్లోనే కేజీ వెండిపై ఏకంగా రూ.5వేలు తగ్గింది దేశీయ మార్కెట్లో ఉదయం 6గంటలకు 2,55,000గా ఉన్న కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి ప్రస్తుతం రూ.2,50,000గా వద్ద ట్రేడవుతుంది.




