
US-Iran War: అమెరికా అధ్యక్షుడు ఇరాన్ యుద్ధం గురించి చేస్తున్న వ్యాఖ్యల్ని ఇరాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ డీల్కు ఒప్పుకోకుంటే ఇరాన్ను ‘‘రాతియుగానికి’’ తీసుకెళ్తామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సైనికాధికారి సయేద్ మజిద్ మూసావి మాట్లాడుతూ.. 250 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా, 6000 ఏళ్ల నాగరికత కలిగిన మా దేశాన్ని బెదిరిస్తుందా? అని ఎద్దేవా చేశారు.
Read Also: Karnataka: ప్రొఫెసర్తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..
బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ మజీద్ మూసావి, ఇరాన్ అత్యున్నత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) ఏరోస్పేస్ దళానికి కమాండర్గా ఉన్నారు. ‘‘మీరు మమ్మల్ని రాతియుగానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు, కానీ మీ సైనికులనే సమాధుల్లోకి పంపిస్తున్నారు. ట్రంప్ హాలీవుడ్ సినిమా ప్రభావంతో భ్రమల్లో ఉన్నారు. చిన్న చరిత్ర కలిగిన దేశం, గొప్ప నాగరికతను బెదిరించడం హాస్యాస్పదం’’ అని ఆయన అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ కూడా ‘‘ఇరాన్ను స్టోన్ఏజ్’’కు పంపిస్తామని బెదిరించారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం 5వ వారంలోకి చేరింది. ఇప్పటికీ రెండు పక్షాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. ఇరాన్ ప్రతీకారంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసేసింది. గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్, కువైట్లపై దాడులు చేస్తోంది.