
భారతదేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఉత్తరాఖండ్కు చెందిన ఒక యువతి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్, పెద్ద నగరాల్లో మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనను కళ్లకు కట్టింది. ఈ ఘటన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో వందలాది మంది నెటిజన్లు స్పందించారు. రెడ్డిట్లో తన అనుభవాన్ని పంచుకున్న ఆ యువతి, తను పుట్టి పెరిగిన ఉత్తరాఖండ్లో వాతావరణం ఎంత సురక్షితంగా ఉంటుందో వివరించింది. అక్కడ రాత్రి పూట ఒంటరిగా నడిచినా ఎటువంటి భయం ఉండేది కాదని, కానీ ఢిల్లీకి వచ్చాక తన జీవనశైలి పూర్తిగా మారిపోయిందని తెలిపింది. ఇక్కడ సాయంత్రం 8 గంటలకే నేను ఇంటికి చేరుకోవాలి. అంతకు మించి బయట ఉంటే ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది అని ఆమె పేర్కొంది.
కేవలం నేరాలు జరగడమే కాకుండా, వీధుల్లో పురుషులు చూసే విధానం (Leering) కొన్ని ప్రాంతాల్లోని వెలుతురు లేని రహదారులు తనలో అభద్రతను పెంచుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనలాంటి ఎంతో మంది యువతులు ఇదే భయంతో తమ కెరీర్ లేదా వ్యక్తిగత స్వేచ్ఛను త్యాగం చేస్తున్నారని ఆమె రాసుకొచ్చింది. వైరల్గా మారిన ఈ పోస్ట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు యువతికి మద్ధతుగా ఢిల్లీలో మహిళలు సేఫ్ అని చెప్పుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లడం ఇప్పటికీ రిస్కే అని కొందరు కామెంట్ చేశారు.
Being a Uttarakhandi girl born and raised in Delhi/NCR, I’ve always carried a sense of pride in our roots, but today I just feel heavy.
by
u/luckyasiangirl in
Uttarakhand
మరికొందరు మహిళలు ఢిల్లీలో సురక్షితంగా ఉండటానికి తాము పాటించే చిట్కాలను (లైవ్ లొకేషన్ షేరింగ్, పెప్పర్ స్ప్రే వంటివి) పంచుకున్నారు. మెట్రో నగరాలు అభివృద్ధి చెందుతున్నా, మహిళల ఆలోచనా విధానంలో మార్పు రాకపోవడం పట్ల చాలా మంది విచారం వ్యక్తం చేశారు. ఈ వైరల్ పోస్ట్ ప్రభుత్వాలకు, సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. మహిళలు ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా నిర్భయంగా తిరగగలిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ కథనం స్పష్టం చేస్తోంది.