
Chennai Super Kings vs Punjab Kings: ఐపీఎల్ 2026 ఆరంభ వేడుకల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ఆశించిన రీతిలో సాగలేదు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మొదటి పోరులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి చెందడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని కాస్త దెబ్బతీసింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్తో తలపడనున్న తరుణంలో, రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై టీం విజయపథంలోకి రావాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం జట్టు కూర్పులో సమూల మార్పులు అవసరమని యాజమాన్యం భావిస్తోంది.
ఓపెనింగ్ జోడీపైనే ఆశలు..
పంజాబ్ కింగ్స్తో జరిగే పోరులో సంజు శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. గత మ్యాచ్లో వీరిద్దరూ కేవలం ఆరు పరుగులకే వెనుదిరగడంతో జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. అయితే, వీరిద్దరికీ ఉన్న సామర్థ్యాన్ని గుర్తించిన యాజమాన్యం, ఈ జోడీపైనే మరోసారి నమ్మకం ఉంచింది. పవర్ ప్లే ఓవర్లలో వీరు ఇచ్చే శుభారంభం జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించనుంది.
మిడిలార్డర్ పరిస్థితి..
ఈ మ్యాచ్లో మూడవ, నాలుగవ, ఐదవ స్థానాల్లో ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. గత మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన డెవాల్డ్ బ్రెవిస్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో జట్టులోకి రావడం శుభపరిణామం. బ్రెవిస్ రాకతో మధ్య వరుసలో బ్యాటింగ్ బలం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. శివమ్ దూబే తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపిస్తే చెన్నైకి తిరుగుండదు.
చివరలో ఫినిషర్లు..
లోయర్ మిడిల్ ఆర్డర్లో యువ ఆటగాళ్లు కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ కీలక బాధ్యతలు పోషించనున్నారు. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంలో వీరిద్దరూ సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ కొత్త బంతితో ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు సిద్ధంగా ఉండగా, జేమీ ఓవర్టన్ మధ్య ఓవర్లలో వికెట్లు తీయనున్నారు. స్పిన్ బాధ్యతలను నూర్ అహ్మద్ సమర్థవంతంగా నిర్వహించనున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ టీం: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..