Reading Time: < 1 minute

పనిమనిషే ఇంటి దొంగ.. 10 తులాల బంగారం,  10 తులాల వెండి రికవరీ

Caption of Image.

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: ఇంట్లో నమ్మకంగా ఉన్న పనిమనిషే డబ్బుపై వ్యామోహంతో కూతురుతో కలిసి చోరీఈ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పనిమనిషిని అరెస్ట్ ​చేసి దోచుకున్న నగలను రికవరీ చేశారు. బుధవారం ఆదిలాబాద్​లోని పోలీస్​ హెడ్​క్వార్టర్స్​లో ఎస్పీ అఖిల్​ మహాజన్​ కేసు వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ మండలం అడేగాంకు చెందిన దేవల లక్ష్మి స్థానిక టీచర్స్​ కాలనీలో నివసిస్తున్న ఉపాధ్యాయుడు పవార్ ప్రేమ్​సింగ్​ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. గత నెల 18న ప్రేమ్​సింగ్​తన కుటుంబంతో కలిసి ఫంక్షన్​కు వెళ్లారు.

దీంతో ప్రణాళిక ప్రకారమే లక్ష్మి ముందుగానే ఇంటి వెనకాల గది తలుపునకు గడియ పెట్టలేదు. అనంతరం తన మైనర్​కూతురితో కలిసి ఇంట్లో నుంచి పది తులాల బంగారం, పది తులాల వెండిని దొంగిలించింది. ఈ నెల 26న బీరువా తీసి చూసే సరికి నగలు లేకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు పనిమనిషే అసలు దొంగ అని గుర్తించి ఆమెను అరెస్ట్​ చేసి దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. కేసును ఛేదించిన ఎస్​హెచ్​వో బండారి రాజు, ఎస్సై రమేశ్, సిబ్బంది రుక్మారెడ్డిని ఎస్పీ అభినందించారు.

©️ VIL Media Pvt Ltd.