
కోనరావుపేట,వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి నెలవుతున్నా ఇంతవరకు తూకం వేయడం లేదని వాపోయారు.