
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మల్లన్నసాగర్ భూనిర్వాసిత కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్&ఆర్ కాలనీకి వస్తున్న క్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల వారు నినాదాలు చేసుకోవడంతోపాటు చెప్పులు విసురుకున్నారు. తమకు అన్యాయం చేసిన హరీశ్ రావు కాలనీకి రావద్దని భూనిర్వాసితులతోపాటు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టగా ఉద్రిక్తత నెలకొంది.