
నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా క్రీడాకారులుగా మారారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2026 లో భాగంగా సందడి చేశారు. శనివారం (మార్చి 28న) సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్, కల్చరల్ మీట్2026 లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాక్టివ్ గా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి పుట్ బాల్ఆడి ఆకట్టుకున్నారు.
►ALSO READ | మరోసారి ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్.. గోల్ కొట్టి అదరగొట్టారు !
లెమన్ అండ్ స్పూన్ పోటీల్లో మంత్రి కొండా సురేఖా మొదటి స్థానంలో ఉండగా ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, రాగమయి తర్వాతి స్థానాల్లో నిలిచారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Inaugural Ceremony of 1st Edition of Telangana Legislators’ Sports Meet 2026 at LB Stadium, Hyderabad https://t.co/WWJHvxssue
— Telangana CMO (@TelanganaCMO) March 28, 2026