
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి ఎల్కలపల్లి గేట్సమీపంలో తమ ఇంటిని మున్సిపల్అధికారులు కూల్చివేశారని పేర్కొంటూ మీనుగు లక్ష్మితోపాటు ఆమె కుటుంబసభ్యులు మంగళవారం కార్పొరేషన్ ఆఫీస్ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తనకున్న 4 గుంటల భూమిని 2021 ఏప్రిల్ కొడుకు పృథ్వీరాజ్పేరుపై రిజిస్టర్చేయించానని, ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇటీవల మున్సిపల్ఆధ్వర్యంలో కూల్చివేశారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయమై కలెక్టర్, మేయర్, కమిషనర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. న్యాయం చేయాలని కార్పొరేషన్ఆఫీస్కు వస్తే అధికారులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.