
Honour Killing: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో పరువు హత్య సంచలనంగా మారింది. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో నివసిస్తున్న ఒక వ్యక్తి, తన 18 ఏళ్ల కూతురిని హత్య చేశాడు. పెళ్లి కాకుండా గర్భవతి కావడంతో, మందులు ఇప్పిస్తానని చెప్పి ఆగ్రాలోని బసౌని ప్రాంతానికి తీసుకెళ్లి, చంబర్ నదిలో ముంచి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన తండ్రి లఖ్పత్ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అతడి ప్రవర్తనను అనుమానించిన పోలీసులు క్షుణ్ణంగా విచారించడంతో అసలు విషయం వెల్లడించాడు
బసౌని ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం ఢిల్లీలోని టిగ్రి ప్రాంతంలో నివసిస్తోంది. జూలై 29న బాలిక తండ్రి ఆమెకు మందులు ఇప్పిస్తాననే నెపంతో ఆగ్రాలోని బసౌని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడే చంబల్ నదిలో ముంచి హత్య చేశాడు. పెళ్లి కాకుండానే గర్భవతి కావడం కుటుంబానికి ఆగ్రహం తెప్పించిందని, అందుకే తన అల్లుడితో కలిసి కుట్ర పన్నిట్లు తండ్రి ఒప్పుకున్నాడు. ప్రస్తుతం మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.