
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని జీఎం ఆఫీస్ ఏరియాలోని కేంద్ర మాజీ మంత్రి కాకా విగ్రహం వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ లీడర్లు కోరారు. బుధవారం కాంగ్రెస్ లీడర్ కామ విజయ్ఆధ్వర్యంలో కార్పొరేషన్ కమిషనర్ జె.అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. అలాగే కాకా విగ్రహం వద్ద నల్లా కనెక్షన్ ఇప్పించాలని, ప్రతిరోజూ శానిటేషన్ పనులు చేయాలని కోరారు. కార్యక్రమంలో లీడర్లు తిప్పారపు మధు, కోరం నరేందర్ రెడ్డి, హకీమ్, విజయ్ రావు, కృష్ణ, శ్రీనివాస్, రాజు, శేఖర్, సర్దార్, కల్యాణ్ పాల్గొన్నారు.