Reading Time: < 1 minute

 హర్యానాలో జరుగుతున్న సూరజ్‌కుండ్ మేళాలో విషాదం నెలకొంది. ఉత్సవం జరుగుతుండగా ఓ రంగులరాట్నం కుప్పకూలింది. విధుల్లో ఉన్న ఓ పోలీసు మృతి చెందాడు. 13 మంది గాయపడ్డారు. అంతకు ముందు ఇక్కడనే ఓ ద్వారం విరిగిపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రతి ఏటా ఫరీదాబాద్‌లో పెద్ద ఎత్తున సూరజ్‌కుండ్ హస్తకళల పలు ప్రాంతాల నుంచి జనం తరతివస్తారు. ఉత్సం వద్ద దుర్ఘటన గురించి తెలియగానే జిల్లా ఉన్నతాధికారి ఆయుషు సిన్హా. పర్యాటక శాఖ ఎండి పార్థ్ గుప్తా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. రంగుల రాట్నం కూలి అక్కడున్న పోలీసుపై పడింది. ఆయన అక్కడికక్కడనే మృతి చెందారు. ఆపరేటర్ భుజానికి తీవ్రగాయం అయింది.