Reading Time: < 1 minute

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం (మిర్చి) ధర రోజు రోజుకు పెరుగుతుంది. బుధవారం వండర్ హాట్ మిర్చి ధర అల్ టైమ్ రికార్డ్ ధర నమోదు చేసుకుంది. క్వింటాల్ మిర్చి రూ. 37,100 పలకడం విశేషం. గత నాలుగు సంవత్సరాల నుండి ఇంత పెద్ద మొత్తంలో ధర పలుకలేదని మార్కెట్ అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమేల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన ఆర్. వినోద్ అనే రైతు 80 వండర్ హాట్ మిర్చి మార్కెట్ కు తీసుకొచ్చారు. కీర్తన అనే అడితి ద్వారా దీనికి ధర రూ. 37,100 గా నిర్ణయించారు.