Reading Time: 2 minutes

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నాడు న్యాయవాదిగా సుప్రీంకోర్టుకు హాజరై తమ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) నేపథ్యంలో తలెత్తిన సమస్యలను విన్నవించారు. మూడు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన వేళ.. తమ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్దేశ్యపూర్వకంగానే … హడావుడిగా సర్ చేపట్టారని మమతా బెనర్జీ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. తక్కువ వ్యవధిలో చేపట్టిన ఈ ప్రక్రియ కారణంగా ఒత్తిడికి లోనైన దాదాపు 150 మందికి పైగా మరణించారని, వారిలో బూత్ లెవెల్ అధికారులు (బిఎల్‌ఓ)లు కూడా ఉన్నారని ఆమె కోర్టుకు విన్నవించారు. దయచేసి ప్రజల హక్కులను కాపాడండి …సార్ అని మమతా బెనర్జీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు చేతులు జోడించి విజ్ఞప్తి చేయడం నాటకీయతను తలపించింది. ఒక దశలో న్యాయం మూసిన తలుపుల వెనుక ఏడుస్తోంది.. అని ఆమె సుప్రీంకోర్టులో గొ గ్గోలు పెట్టడం న్యాయమూర్తులనే విస్మ యం పరచింది.

భారత ఎన్నికల కమిషన్ తో తాను సాగిస్తున్న పోరాటంలో తన వాదనను స్వయంగా వినిపించేందుకు మూడురోజులక్రితం దేశరాజధానికి వచ్చిన మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో సర్ ప్రక్రియ నుసవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సుర్యకాంత్ ఆధ్వర్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపించారు. ధర్మాసనంలో జస్టిస్ , జోయ్ మల్యబాగ్చి, విపుల్ పంచోలీ కూడా ఉన్నారు. సర్ విషయంలో తన అభ్యంతరాలను ఎన్నికలకమిషన్ పూర్తిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ, హెచ్చిన స్వరంతో ఈసీ మీద పలు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్ర జలను అణచివేయడానికే ఎన్నికల కమిషన్ బెంగాల్ ను టార్గెట్ చేసిందని ఆమె పేర్కొన్నారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడడానికి కోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఒకటొకటిగా పే ర్కొం టూ, సర్ మొదటి దశ ఫలితంగా దాదాపు 58 లక్షల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయని, చాలా మంది ఓటర్లకు ఫారమ్ 6 కింద అపీలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.

ఈ తొలగింపులను బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి వచ్చిన మైక్రో అబ్జర్వర్లు చేశారని, ఈ ప్రక్రియలో స్థానిక సిబ్బందిని పక్కన పెట్టారని , నివాస ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వం జారీ చేసిన రుజువులు వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను తిరస్కరిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. భాషా సమస్యలు, స్పెల్లింగ్ సరిపోలలేదనే కారణంగా ఓటర్ల జాబితా నుంచి ప్రజల పేర్లు తొలగించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఉదాహరణకు ఒక మహిళ తన అత్తమామల ఇంటి పేరును ఉపయోగించినందున ఆమె పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారని వివరించారు. వివాహం త ర్వాత ఒక మహిళ తన నివాసాన్ని మారినప్పుడు ఈసీ ఆమెను అనుమానితుల లిస్ట్ లో ఉంచుతుందని ఆమె పేర్కొన్నారు. ఆధార్‌ను అంగీకరించడానికి నిరాకరించడం ద్వారా ఈసిఐ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నదన్నారు.మరి కొద్ది నెలల్లో నాలుగు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్తుండగా, ఎన్నికలకు ముందు బెంగాల్ నే లక్ష్యంగా చేసుకున్నారని మమతా ఆరోపించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా సమీక్ష చేపట్టారు.మరి మూడు నెల్లల్లోనే, హడావుడిగా ఇలా చేసేందుకు ఎందుకు తొందరపడ్డారను ఆమె ప్రశ్నించారు.

సర్ నోటీసులు పంపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోర్టు భారత ఎన్నికల కమిషన్ కు నోటీసు జారీ చేసింది. నోబెల్ బహుమ తి గ్రహీత అమర్త్య సేన్, ప్రఖ్యాత బెంగాలీ కవి జాయ్ గోస్వామీ, తృణమూల్ ఎంపీ దీపక్ అధికారి వంటి ప్రముఖులకు కూ డా సర్ నోటీసులు పంపబడ్డాయని తెలిసింది. ఈ కేసును వాయిదా వేస్తూ, మమతా విజ్ఞప్తికి ప్రతిస్పందనగా ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. 10లోగా ఇసి తమ స మాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.