Reading Time: < 1 minute

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజాగా టి20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అభిషేక్ శర్మ (బ్యాటింగ్), వరుణ్ చక్రవర్తి (బౌలింగ్) తమ టాప్ ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన టి20 సిరీస్‌లో అభిషేక్ అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతంఅభిషేక్ 917 రేటింగ్ పా యింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ 834 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అయితే భారత బ్యాటర్ తిలక్ వర్మ ఒక ర్యాంక్‌ను కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు.

గాయం వల్ల తిలక్ కివీస్‌కు దూరంగా ఉన్నాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్‌పై బడింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ ఒక స్థానం ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. పాథుమ్ నిసాంకా (శ్రీలంక) ఒక ర్యాంక్ మెరు గు పడి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం సూ ర్యకుమార్ ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. ఫర్హాన్ (పాకిస్థాన్) ఏడో, ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ 8వ ర్యాంక్‌లో నిలిచారు. టిమ్ సిఫర్ట్ (కివీస్), మిఛెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) టాప్10లో స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

ఇక బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి776 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన పాకిస్థాన్ బౌలర్‌అబ్రార్ అహ్మద్ రెండో ర్యాం క్‌కు దూసుకొచ్చాడు. రషీద్ ఖాన్ (అఫ్గాన్) మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) రెండు ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు.జాకబ్ డఫీ (కివీస్) ఐదో, వనిందు హసరంగ (శ్రీలంక), ఆరో, నవాజ్ (పాకిస్థాన్) ఏడో, ముస్తఫిజుర్ (బంగ్లా) 8వ, ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) తొమ్మిదో, ముజీబ్ (అఫ్గాన్) పదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.