Reading Time: < 1 minute

మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యుమ్నాం ఖేమ్ చంద్ సింగ్ బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు.గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. కుకి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నమ్చా కిఫ్గెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసన సభ్యుడు ఎల్ దిఖో మణిపూర్ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఖేమ్ చంద్ సింగ్ బీజేపీ శాసన సభాపక్షనేతగా ఎన్నికయ్యారు. బీజేపీకి చెందిన గోవిందాస్ కోంథోజామ్ , ఎన్ పిపికి చెందిన కె. లోకెన్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నమ్చా కిఫ్గెన్ న్యూఢిల్లీలోని మణిపూర్ భవన్ నుంచి వర్చువల్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన రద్దు చేసిన కొద్ది గంటల తర్వాత ఇంఫాల్ లోని లోక్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది.