Reading Time: < 1 minute

కొత్తగూడెంలో వారసంత, డైలీ మార్కెట్ టెండర్లు ఫైనల్

Caption of Image.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరంలో వారసంతతో పాటు డైలీ మార్కెట్​, కబేళా, షాపింగ్​ కాంప్లెక్స్​కు సంబంధించి టెండర్లు ఫైనల్​ అయ్యాయి.  మేయర్​ ఆధ్వర్యంలో కమిషనర్​సుజాత వేలంపాట ద్వారా టెండర్లను ఫైనల్​ చేశారు. వారసంతను రూ. 37లక్షలకు ఎం. మోహన్​ రావు, డైలీ మార్కెట్​ రూ. 47.05లక్షలకు దక్కించుకున్నారు. రూ. 1,01,500కు కబేళాను ఖాదిర్​ పాషా దక్కించుకున్నారు.  కార్పొరేషన్​ పరిధిలోని సుజాతనగర్​ ప్రాంతంలో గల నాలుగు షాపులకు కార్పొరేషన్​ సూచించిన దానికన్నా అతి తక్కువగా ధర రావడంతో ఆ టెండర్లను క్యాన్సల్​ చేస్తున్నట్టు కమిషనర్​ సుజాత పేర్కొన్నారు.

గతంలో టెండర్లు దక్కించుకొని కార్పొరేషన్​కు డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ కాంట్రాక్టర్ల వద్ద నుంచి డబ్బులు రికవరీ  చేయాలని పలువురు డిమాండ్​ చేశారు. టెండర్ల, వేలం పాట టైంలో వేదికపై కమిషనర్​ పక్కనే మేయర్​ గణేష్​ కూర్చోవడం నిబంధనలకు విరుద్ధమంటూ పలువురు పేర్కొనడం చర్చానీయాంశంగా మారింది. మేయర్​ వేదికపై ఉండడం కాంట్రాక్టర్లను ప్రభావితం చేయడమేనని పలువురు విమర్శించారు. టెండర్లు, వేలం పాట నిర్వహిస్తున్న క్రమంలో కొందరు కాంట్రాక్టర్లు తరచూ బయటకు వెళ్లి వస్తుండడం, కార్పోరేటర్లు వేలం టైంలో అక్కడే ఉండడం పట్ల ఆఫీసర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  

©️ VIL Media Pvt Ltd.