Reading Time: < 1 minute
Pakistan Hikes Fuel Prices By 137 Diesel Up 184 Amid Iran Us War

ఇరాన్ అంతు చూస్తామంటూ ట్రంప్ ప్రకటన తర్వాత ప్రపంచ దేశాలు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఇక ట్రంప్ ప్రకటన తర్వాత చమురు ధరలు మరింత ఆకాశన్నంటుతున్నాయి. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో ధరలు భారీగా పెరగగా.. తాజాగా పాకిస్థాన్ కూడా ఇంధన ధరలు పెంచేసింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

ఇది కూడా చదవండి: Iran-US War: ఇరాన్‌పై అమెరికా దాడులు.. కూలిన అతి పెద్ద వంతెన.. 8 మంది మృతి

లీటర్‌ పెట్రోల్‌పై ఏకంగా రూ.137 పెంచగా.. డీజిల్‌పై రూ. 184 పెరిగింది. ఇక కిరోసిన్ ధరను లీటర్‌కు రూ.34.08 పెంచింది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.458.4కు చేరింది. ఇక డీజిల్ ధర రూ.520.35కు పెరగగా.. లీటర్ కిరోసిన్ ధర రూ.457.80కు చేరింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న దగ్గర నుంచి పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్రంగా పెరిగింది. దీంతో నిరంతరం ధరలను పెంచుతూనే ఉంది. కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం శాఖ మంత్రి మాలిక్ చెప్పినట్లు డాన్ పత్రిక నివేదించింది.

ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం తొలుత మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 పెంచింది. ఇప్పుడు ఆ పెంపును మరోసారి పెంచేసింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. తాజాగా మరోసారి ఇంధన ధరలు పెరిగిపోవడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.