Reading Time: < 1 minute

గంగాధర సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో విజిలెన్స్ తనిఖీలు

Caption of Image.

గంగాధర, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా గంగాధర సబ్‌‌‌‌‌‌‌‌రిజిస్ట్రార్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో విజిలెన్స్ అండ్​ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులు, భూ క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. ఇటీవల జరిగిన భూ రిజిస్ట్రేషన్లు, ఫీజుల లావాదేవీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనుసరించిన విధానాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. పలు విభాగాలకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డ్​ ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు సేకరించారు. 

కాగా విజిలెన్స్ అధికారుల రాకను గమనించిన కార్యాలయ పరిసరాల్లో ఉన్న డాక్యుమెంట్​ రైటర్లు తమ షటర్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. విజిలెన్స్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫీజుల వసూళ్లు, అధికారిక లావాదేవీలు నిబంధనలకు అనుగుణంగా జరిగాయా లేదా అని విచారించినట్లు సమాచారం.

©️ VIL Media Pvt Ltd.