Reading Time: < 1 minute

ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో పాల్గొన్న సీఎం రేవంత్.. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు

Caption of Image.

సీఎం రేవంత్ రెడ్డి సెల్ఫ్  ఎన్యుమరేషన్‌లో పాల్గొన్నారు.  వెబ్ సైట్ లో స్వయంగా వివరాలను నమోదు చేసుకున్నారు. 2027  జనగణనలో భాగంగా తెలంగాణలో ఇవాళ (ఏప్రిల్ 26) నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారుల సమక్షంలో సీఎం తన వివరాలను నమోదు చేసుకున్నారు.

జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జనగణనలో స్వయంగా నమోదు చేసుకునే విధానాన్ని గురించి చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అత్యంత కీలకమైన జనగణన కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ , జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల, సమాచార పౌర సంబంధాల కమిషనర్‌ సీహెచ్. ప్రియాంక తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.