
‘సిద్ధార్థ్ రాయ్’ చిత్రంలో హీరోగా అరంగేట్రం చేసి ఆకట్టుకున్న బాలనటుడు, హీరో దీపక్ సరోజ్, ఇప్పుడు హరి హరన్ గోధగాని దర్శకత్వంలో తన రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హరి తన్నిరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపక్ సరోజ్ సరసన అనైరా గుప్తా, దీప్సిక నటిస్తున్నారు. పవిత్రమైన శ్రీరామ నవమి సందర్భంగా, చిత్ర బృందం టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ’శ్రీమహా విష్ణు’ అనే టైటిల్తో వస్తున్న ఈ రొమాంటిక్ ఫస్ట్ లుక్, హీరో హీరోయిన్ మధ్య ఒక లవ్లీ మూమెంట్ ని చూపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది, పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు హరి హరన్ గోధగాని మాట్లాడుతూ ఈ సినిమా ప్రేమను వేడుకలా చూపిస్తూ, కుటుంబ విలువల ప్రాముఖ్యతను కూడా సున్నితంగా తెలియజేస్తుందని అన్నారు. ఈ ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను మేకర్స్ మే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.