
పంజాగుట్ట, వెలుగు: యువతలో జాతీయ భావ స్ఫూర్తిని నింపేందుకు ఈ నెల 15న హైదరాబాద్నుంచి కరీంనగర్వరకు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకురాలు కీర్తి రెడ్డి తెలిపారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో అఖంఢ భారత్సేవా ఫౌండేషన్ఆధ్వర్యంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ ఆవిష్కరించారు.
ర్యాలీ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమై గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, మీదుగా కరీంనగర్చేరుకుంటుందని తెలిపారు. సినీ నటుడు జై సిద్ధార్థ్, భారత్ న్యూస్ చీఫ్ సహన, బిందు పాల్గొన్నారు.