Reading Time: < 1 minute
Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ..

ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన భూక్యా గౌతమీ రాథోడ్ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను విద్యాశాఖ ఎత్తివేస్తూ తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రీజాయినింగ్ ప్రక్రియలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఉద్యోగాన్ని వీడాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

విద్యాశాఖ సస్పెన్షన్‌ను ఎత్తివేసి తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రీజాయినింగ్ కోసం వెళ్లిన సమయంలో జిల్లా విద్యాశాఖాధికారి (DEO) తనను అవమానించారని గౌతమీ రాథోడ్ ఆరోపించారు. ఆ అవమానం, మానసిక వేదనను తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

వీడియోలో కన్నీటి పర్యంతం

సోమవారం విడుదల చేసిన వీడియోలో గౌతమీ రాథోడ్ భావోద్వేగానికి గురయ్యారు. సస్పెన్షన్ ముగిసిన తర్వాత కూడా తనను గౌరవంగా చూడలేదని, అధికారుల తీరు తనను తీవ్రంగా కలచివేసిందని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలు, అవమానాలను భరించే పరిస్థితి లేదని పేర్కొంటూ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా విద్యాశాఖాధికారి తనను తీవ్రంగా అవమానించారని, మానసిక వేధింపులకు గురిచేశారని గౌతమీ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగేందుకు అవసరమైన గౌరవం, న్యాయం తనకు దక్కలేదని ఆమె వీడియోలో పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Bhukya Gowthami (@gouthamirathode)

కాగా గౌతమీ రాథోడ్ చేసిన ఆరోపణలపై జిల్లా విద్యాశాఖాధికారి లేదా విద్యాశాఖ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. ఆమె ఆరోపణలపై అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గౌతమీ రాథోడ్ రాజీనామా ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె చేసిన ఆరోపణలపై అధికారిక విచారణ లేదా విద్యాశాఖ స్పందన వెలువడిన తర్వాతే పూర్తి వాస్తవాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి